వారికి థాంక్స్ చెప్పిన ఏపీ గవర్నర్…!

-

ఉపాధ్యాయిల సహాకారంతోనే ప్రగతిశీల సమాజం సాధ్యమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. డాక్టర్ సర్వేపల్లి జన్మదినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయిలకు శుభాకాంక్షలు తెలిపారు ఆయన. ఉపాధ్యాయులు సమాజం యొక్క వాస్తుశిల్పులని, భారతావని నిర్మాణంలో వారి భూమిక ఎంచదగినదని ఆయన వ్యాఖ్యానించారు.

దేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా, భారత రెండవ రాష్ట్రపతిగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశానికి అందించిన సేవలకు గౌరవార్థంగా, ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 5ను ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామని చెప్పుకొచ్చారు. డాక్టర్ రాధాకృష్ణన్ ఆదర్శవంతమైన విద్యావేత్త, పండితునిగానే కాక తత్వవేత్తగా, రచయితగా భారత దేశానికి సేవలు అందించారన్నారని ఆయన కొనియాడారు. సర్వేపల్లి తన జీవితంలో ఉన్నత నైతిక విలువలకు కట్టుబడిన మహనీయిడని గవర్నర్ ఈ సందర్భంగా అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news