రైనాకి బిగ్ షాక్.. చెన్నై గ్రూప్ నుంచి ఔట్..!

-

యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనున్న సంగతి తెలిసిందే. దుబాయ్‌, అబుదాబి, షార్జా వేదికల్లో మొత్తం 53 రోజుల విండోలో 60 మ్యాచ్‌ల్ని నిర్వహించనున్నారు. లీగ్ కోసం ఇప్పటికే యూఏఈ చేరుకున్న అన్ని ప్రాంఛైజీలు క్వారంటైన్ పూర్తిచేసుకుని ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ వైస్ కెప్టెన్ సురేష్ రైనా ఆకస్మికంగా ఇండియాకు తిరిగి రావడం హాట్ టాపిక్ గా మారింది.

ఆయన ఇండియా వచ్చిన వెంటనే.. ఆయన అత్తామామలపై దొంగలు దాడి జరగడం ఇవన్నీ సంచలనం సృష్టించాయి. అలాగే తాజాగా… రైనా దుబాయ్‌ నుంచి బయల్దేరగానే చెన్నై సూపర్ కింగ్స్ వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి ఆయనను తొలగించారని సమాచారం. ఆ తర్వాత జట్టులోకి తిరిగి వచ్చేందుకు అవకాశం ఇవ్వాలని రైనా విజ్ఞప్తి చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news