కాశ్మీర్ ను మనదేశం నుండి విడదియ్యాలి కాంగ్రెస్ చూస్తుంది..!

-

కాకినాడలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అప్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురంధరేశ్వరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కీలక కామెంట్స్ చేశారు పురందేశ్వరి. ప్రజలు మన్ననలు ఉన్నాయి కనుక వరుసగా మూడు సార్లు కేంద్రంలో బీజేపీ పార్టీ కి అధికారం ఇచ్చారు. కలకత్తా డాక్టర్ హత్య అక్కడ ముఖ్యమంత్రి మమత బెనర్జీ అసమర్ధతకు నిదర్శనం. కానీ మోడీ పరిపాలన వలన 11 ఆర్థిక వ్యవస్థ గా ఉన్న భారత్ 5 స్థానంలో ఉంది.. 3వ ఆర్థిక వ్యవస్థగా మారడానికి సిద్ధం అవుతుంది అన్నారు.

అలాగే 370 ఆర్టికల్ రద్దు చేసి.. కాశ్మీర్ భారత భూ భాభాగంలో కలిసి ఉండేలా చేసిన ఘనత బీజేపీ కి దక్కుతుంది. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ జమ్మూ కాశ్మీర్ లో జరగబోయే ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. అందులో ఆర్టికల్ 370 తిరిగి తీసుకు వస్తాం అని చెప్పడం దారుణం. కాంగ్రెస్ పార్టీ కాశ్మీర్ ను మన భారతదేశం నుండి విడదియ్యాలి అని చూస్తుంది అని పురందేశ్వరి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news