బీజేపీ విష్ణు మాటలు విన్నారా… నమ్మాలంతే!!

-

జనాలకు చెవులు ఉంటాయి.. వాటినుంచి వారు వినగలుగుతారు.! ప్రజలకు మస్తిష్కాలుంటాయి.. దానిద్వారా అన్నీ గమనించగలుగుతారు, గ్రహించగలుగుతారు.. గుర్తుంచుకోగలుగుతారు.! కేవలం రాజకీయ నాయకులను నమ్మినంతమాత్రాన్న.. ప్రజలు అమాయకులు అనుకుంటే ఎలా.. నమ్మడం బలహీనత అనుకుంటే ఎలా.. నాయకులను నమ్మడం ఒక నమ్మకం అంతే!! ఈ విషయాలను మరిచిన విష్ణువర్ధన్ రెడ్డి తాజాగా బీజేపీకి వైకాపాకు మధ్య వ్యత్యాసం చెప్పుకొస్తున్నారు.. జనం వింటున్నారని మరుస్తున్నారు!!

“ఏపీలో పూటకో భాష, పూటకో వేషం వేసే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. బీజేపీ మాత్రమే హిందూ ఆలయాలపై దాడులకు నిరసనగా పోరాటం చేశాయి. దేవాదాయ ‌భూములు, ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పంచి పెడుతుంది. బీజేపీకి మీలాగా మత రాజకీయాలు చేయడం అలవాటు లేదు” ఇది బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి వైకాపా నేతలపైన చేసిన వ్యాఖ్యలు! ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపైనే ఆన్ లైన్ వేదికగా కామెంట్లు పడుతున్నాయి!

మతరాజకీయాలు వైకాపా చేస్తుందని… బీజేపీ అలాంటి మతరాజకీయాలు చేయదని, అలాంటి అలవాటు ఆ పార్టీకి లేదని చెబుతున్నారు విష్ణు! దీంతో… విష్ణు కాసేపు ఆయాసం, ఆవేశం తప్పించుకుని అనంతరం కాసేపు కళ్లుమూసుకుని, ప్రశాంతంగా ఆలోచించుకుంటే… అసలు మత రాజకీయాల విషయంలో బీజేపీ స్థానం ఏమిటి? అసలు ఆ రాజకీయాలతో వైకాపాకున్న సంబంధం ఏమిటి? అనేది స్పష్టం అవుతుందని అంటున్నారు నెటిజన్లు!! విష్ణు ఈ టాపిక్ కాకుండా వేరే ఏదైనా మాట్లాడి ఉంటే మరింత బాగుండేది అనేది మరో కామెంట్!!

Read more RELATED
Recommended to you

Latest news