బిజెపి టెక్నిక్ లు ఏపీలో పనిచేయడం లేదు – విజయసాయిరెడ్డి

-

కొద్ది రోజులుగా ఏపీ పై బిజెపి అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు అగ్ర నేతలు ఏపీలో పర్యటించారు. ముందుగా బిజెపి చీఫ్ జేపీ నడ్డా శనివారం రోజు ఏపీలో పర్యటించగా.. తాజాగా అమిత్ షా సైతం ఏపీలో పర్యటించి వైసీపీ సర్కార్ పై మాటల దాడి చేశారు. దీంతో అధికార పార్టీని ఆత్మ రక్షణ లోకి నెట్టినట్లు అయింది. అయితే వెంటనే కోరుకున్న వైసీపీ నేతలు బిజెపిపై ఎదురుదాడి ప్రారంభించారు.

 

అమిత్ షా, జేపీ నడ్డా వ్యాఖ్యలను తప్పుపడుతూ మండిపడుతున్నారు వైసీపీ నేతలు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం బిజెపి నేతలకు కౌంటర్ ఇచ్చారు. “బిజెపికి ఏపీలో ప్రచారం చేసుకోవడం కష్టంగా మారింది. వారు ఎక్కడికి వెళ్లినా ప్రజలు ప్రత్యేక హోదా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, సౌత్ కోస్ట్ రైల్వే జోన్, ఏపీ విభజన హామీల గురించి ప్రశ్నిస్తున్నారు. దీంతో పాపం బిజెపి టెక్నిక్ లు ఏపీలో పని చేయడం లేదు” అని ట్విట్ చేశారు విజయ్ సాయి రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news