నోటా vs 151.. భారీ ఎత్తున బీజేపీ ఛాలెంజులు

-

కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అనే సామెత సూటవుతుందో లేదో తెలియదు కానీ… ఏపీలో బీజేపీ నేతలు మాత్రం ఎక్కడా ఆగడం లేదు! జనం చూస్తున్నారు.. వారికి అన్నీ తెలుసున్న విషయం కూడా మరుస్తున్నారు! అందులో భాగంగానే రాబోయే కాలంలో కాబోయే సీఎం తమ అభ్యర్ధే అని ఇప్పటికే చెప్పిన బీజేపీ నేతలు మరో అడుగు ముందుకేశారు!

మహానాడు వేదికగా కార్యకర్తలను కాస్త ఉత్సాహపరచాలనో లేక బావ దగ్గర “బాగా మాట్లాడావు బాలయ్య” అనిపించుకోవాలనో తెలియదు కానీ… పూర్తికాలం వైకాపా ప్రభుత్వం ఉండదని.. రేపో మాపో పడిపోతుందని చెప్పుకొచ్చారు బాలయ్య! సరే బాలయ్య రాజకీయ పరిపక్వత అందరికీ తెలిసిందే కాబట్టి… ఆ మాటలు విన్న నేతలు, కార్యకర్తలు పెద్దగా స్పందించలేదు. పసుపు మీడియా కూడా దాన్ని లైట్ తీసుకుంది! ఇప్పుడు అవే మాటలు మాట్లాడేస్తున్నారు ఏపీ బీజేపీ నేతలు!

బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు తాజాగా స్పందిస్తూ… “వైసీపీ సర్కార్ మరో మూడున్నరేళ్ళు అధికారంలో కొనసాగడం కష్టం” అని చెప్పుకొస్తున్నారు. నిజం చెప్పాలంటే… టీడీపీ చలువతో 2014 ఎన్నికల్లో గెలిచిన ఈయన.. అవన్నీ బీజేపీ ఓట్లని భ్రమపడుతున్నారో ఏమో కానీ.. అంతటీ పెద్ద పెద్ద డైలాగులు పేల్చుతున్నారు. ఇలాంటి కబుర్లు చెప్పిన చంద్రబాబే వాస్తవాలు గ్రహించి గమ్మునుంటే.. ఏపీ బీజేపీ నేతలు మాత్రం ఈ రేంజ్ లో డైలాగులు పేల్చేస్తున్నారు!

దీంతో ఆన్ లైన్ వేదికగా ఫైరవుతున్నారు వైకాపా కార్యకర్తలు! నోటాతో పోటీపడి గెలిచినంత ఈజీ కాదు.. ఏపీలో జగన్ పై గెలవడం అని ఆన్ లైన్ వేదికగా కౌంటర్స్ వేస్తున్నారు. ఇక వైకాపా నాయకులంటరా… ఏపీ బీజేపీ నేతల మాటలను… చిన్న పిల్లాడి మాటల్ల తీసిపారేస్తూ.. స్పందించేటంత పెద్ద మేటర్ కాదన్నట్లుగా నవ్వి ఊరుకుంటున్నారు!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news