వైజాగ్ బీచ్ లో అర్థనగ్నంగా యువతి మృతదేహం

-

విశాఖ బీచ్ లో వివాహిత మృతదేహం కలకలం రేపింది. వైఎంసిఏ బీచ్ లో అనుమానాస్పద స్థితిలో యువతి మృతదేహం కనిపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మృతురాలు పెదంగట్యాడకు చెందిన శ్వేతగా గుర్తించారు పోలీసులు. మంగళవారం ఉదయం మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే డెడ్ బాడీ పడివున్న తీరుపై చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మహిళ మృతదేహం పై గాయాలు, ఒంటిపై సరిగా దుస్తులు లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే వివాహిత శ్వేత మంగళవారం మిస్ అయినట్లు న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఈ క్రమంలోనే శ్వేత కోసం పోలీసులు గాలిస్తున్న సమయంలో బుధవారం ఉదయం విశాఖ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మృతదేహం లభ్యమైనట్లు సమాచారం. అయితే ఎవరైనా హత్య చేశారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news