రూ. 10 వేల కోట్లతో ముంబైని మించిపోయేలా విశాఖ !

-

విశాఖపట్నంను రూ. 10వేల కోట్లతో అభివృద్ధి చేస్తే ముంబైని తలదన్నే నగరం అవుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. విశాఖపట్నం పరిపాలన రాజధాని అయితే వచ్చే నష్టం ఏంటని ప్రశ్నించారు.

ఈ మేరకు విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, అమరావతికి తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదని.. వికేంద్రీకరణ తోనే రాష్ట్రమంతా అభివృద్ధి జరుగుతుందని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. తమ ప్రభుత్వానికి 26 జిల్లాలు సమానమేనని అన్నారు. విశాఖలో మాత్రం తక్కువ అవుతుందని చెప్పారు.

అమరావతిలో అంత ఖర్చు అవసరమా అని తాము ఆలోచన చేసామని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తున్నామని వివరించారు. శ్రీ బాగ్ ఒప్పందం మేరకే కర్నూలు న్యాయ రాజధానిగా చేస్తున్నామన్నారు.. టాప్ 5 సిటీస్ లో విశాఖ ఉందని.. విశాఖ శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. మూడు రాజధానులపై అసెంబ్లీలో సీఎం జగన్ స్పష్టంగా చెప్పారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news