సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ..హత్యకు భారీ కుట్ర !

-

సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ…సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రజాసేవకన్నా వ్యక్తిగత స్వార్థం, అవినీతి పెరిగింది అన్నారు సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ. వివిధ ప్రభుత్వ శాఖల్లో నిజాయితీగా పనిచేస్తున్న పలువురు అధికారులను యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఆధ్వర్యంలో సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

అవినీతిని ఎలా తగ్గించాలన్న దానిపై ఆలోచించాలని, ఆదాయ పన్ను శాఖలో వ్యక్తులు కలుసుకునే అవసరం లేకుండా ఆన్ లైన్ విధానం తెచ్చారని గుర్తు చేశారు. ఇలా సాంకేతికత అవినీతిని తగ్గించే లక్ష్యంతో ఉండాలి అన్నారు. నిజాయితీగా ఉండాలని నిర్ణయించుకున్న వారికి కష్టాలు తప్పవని, తనను, తన కుటుంబాన్ని చంపేస్తామని ఎరుపు ఇంకుతో బెదిరింపు రాసిన లేఖలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి అని గుర్తు చేసుకున్నారు. పెద్ద తిమింగలాలు వలలో పడవు, వాటిపై దృష్టి సారించి రాజకీయ అవినీతిని రూపుమాపేందుకు కృషి జరగాలి అని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news