YCP నేతలకు భద్రత కల్పించాలని బొత్స డిమాండ్‌..!

-

రాష్ట్రంలో ఆటవిక పాలన, రెడ్‌ బుక్‌ రాజ్యాంగం కొనసాగుతుంది. గుడివాడలో మాజీ మంత్రి పేర్నినాని లక్ష్యంగా రెండు సార్లు దాడులు జరిగాయి అని బొత్స సత్యనారాయణ అన్నారు. సోషల్‌మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్‌కు అండగా న్యాయసహాయం కోసం గుడివాడ వెళ్లారు మాజీ మంత్రి పేర్నినాని. కానీ ఆ ఇంటి వద్దకు చేరుకుని ఆయన కారుపై దాడిచేసి అద్దాలు పగలగొట్టిన టీడీపీ, జనసేన నేతలు. పోలీసుల సమక్షంలోనే దౌర్జన్యం, దాడులు జరుగుతున్నాయి అన్నారు బొత్స.

అలాగే ఈ గుడివాడలో ఘటనలపై పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్‌ చేసి మాట్లాడారు బొత్స సత్యనారాయణ. కృష్ణాజిల్లా ఎస్సీకి ఫోన్‌ చేసిన బొత్స.. రాష్ట్రంలో శాంతి భద్రతలు సన్నగిల్లుతున్నాయి. పార్టీ నాయకులకు ఏమైనా జరిగితే దానికి పోలీసులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. పోలీసులు తమ కర్త్యవాన్ని నిర్వహించి వారికి భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఆటవిక పాలనకు ఇలాంటి ఈ ఘటనలు నిదర్శనం అని బొత్స పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news