కేబినెట్ విస్తరణపై బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన

-

కేబినెట్ విస్తరణపై బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. కేబినెట్ విస్తరణ ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయం, విచక్షణాధికారం అన్నారు. దాని మీద మంత్రులం మాట్లాడటం కరెక్ట్ కాదని… ఎమ్మెల్సీ ఫలితాలకు మంత్రి వర్గ మార్పుకు సంబంధం ఏముంటుంది? అని తెలిపారు. విశాఖ నుంచి రేపటి నుంచే పాలనా ప్రారంభం కావాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పారు.

వికేంద్రీకరణ అనేదే మా పార్టీ, ప్రభుత్వ విధానం అని.. టీడీపీ వంటి కొన్ని దుష్టశక్తులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహించారు. కోర్టుల్లో సాంకేతిక కారణాలతో ఆలస్యం అవుతోందని వివరించారు. సత్య కుమార్ పై దాడిని టెంటులు వేసుకోవటం అమరావతి రైతుల స్ఫూర్తి నా??అని నిలదీశారు. అక్కడ ఉన్నది అమరావతి రైతులు కాదు.. ప్రభుత్వం ఎందుకు డిజాల్వ్ అవుతుందన్నారు. చంద్రబాబు అలా చేయాలని కోరుకుంటున్నాడు.. స్థిరమైన ప్రభుత్వం ఉందని బొత్స సత్యనారాయణ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news