విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్.. నారా లోకేష్ ట్వీట్

-

ఏపీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ అని ఆరోపించారు. టీడీపీ హయాంలో నిర్మించిన ప్రజావేదికను వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చివేసి 3 ఏళ్లు అయిన సందర్భంగా లోకేష్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. ప్రజా వేదికను కూల్చక ముందు, కూల్చిన తర్వాత ఫోటోలు షేర్ చేశారు.

” విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్ వైయస్ జగన్. ప్రజా వేదిక కూల్చిడంతో మొదలైన విధ్వంసకాండ ఇప్పుడు ఏకంగా రాష్ట్రాన్ని దహించే స్థాయికి చేరుకుంది. ఒక్క చాన్స్ అడిగింది ప్రజాసంక్షేమం కోసం కాదు, ప్రతిపక్షం పై కక్ష తీర్చుకోవడం కోసమే అన్నట్లు సాగుతోంది విధ్వంస పాలన ” అని లోకేష్ ట్వీట్ చేశారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్ట పై ప్రజా వేదికను నిర్మించారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాన్ని అక్రమ కట్టడం గా గుర్తించి కూల్చి వేసింది. దీనిపై టిడిపి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news