తూ.గోలో ఘోర రోడ్డు ప్రమాదం.. విద్యార్థులను ఈడ్చుకెళ్లిన లారీ..!

-

తూర్పు గోదావరి జిల్లా.. రాజానగరం దివాన్ చేరువు జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గైట్ కళాశాలలో బిటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు దుర్మారణం చెందారు. మృతులు శ్రీకాకుళం చెందిన రోనంకి ప్రవీణ్ కుమార్ (20), పల్నాడు జిల్లాకు చెందిన చింతా కార్తీక్ (19) గా పోలీసులు గుర్తించారు. అయితే ఇద్దరు విద్యార్థులై బైక్ పై దివాన్ చెరువు వెళుతుండగా వెనుకనుండి వచ్చిన బొగ్గు లారీ బలంగా ఢీకొని వారిద్దరిపై ఎక్కి రోడ్ పై కొంత దూరం ఈడ్చుకెళ్లింది.

Road accident in Kurnool Medical student killed

దాంతో ఆ జాతీయ రహదారి పై విద్యార్థుల శరీర భాగాలు చల్లచెదురుగా పడిపోయాయి. అయితే ఈ ఘటన అనంతరం లారీ డ్రైవర్ అక్కడి నుండి పారిపోయాడు. ఇక ఘటన స్థలంలో చేరుకొని కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ ఆచూకీ కోసం వెతుకుతున్నారు. అలాగే మొబైల్ ఫోన్ ఆధారంగా మృతుల వివరాలు సేకరిస్తున్న పోలీసులు.. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news