ఏపీ అప్పు కేవలం రూ.1,34,452 కోట్లు మాత్రమే: మంత్రి బుగ్గన ప్రకటన

-

ఏపీ అప్పులపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఏపీ ఆర్థిక అంశాలపై యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యాలను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు శనివారం మంత్రి బుగ్గన ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై టిడిపి రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.

స్థిర ధరల వృద్ధిరేటులో 2021-22 ఏడాదికి సంబంధించి ఏపీ 11.22 శాతం వృద్ధి నమోదు చేసిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. ఏ విధంగా లెక్క చేసిన మైనస్ 4 శాతం వృద్ధి అనేది అసాధ్యమన్నారు. కోవిడ్ సమయంలో దేశ వృద్ధిరేటు -6.60 శాతంగా నమోదు అయితే ఏపీ 0.08% మేర వృద్ధి నమోదు చేసిందన్నారు. 2019లో టిడిపి దిగిపోయే నాటికి రూ.2,64,451కోట్ల అప్పు ఉంటే, 2022 నాటికి రూ.3,98,903కోట్లు అయినట్టు పార్లమెంటులో కేంద్రం ప్రకటించిందని తెలిపారు. అంటే, గత మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.1,34,452కోట్లు మాత్రమేనని బుగ్గన వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news