వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి, మాజీ ఎంపీలపై కేసు

-

వైసీపీ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్పలకు బిగ్‌ షాక్‌ ఇచ్చారు ఏపీ పోలీసులు. వైసీపీ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్పలపై కేసులు పెట్టారు పోలీసులు. చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన టీడీపీ, వైసీపీ పరస్పర దాడుల్లో పోలీసులు కేసులు నమోదు చేశారు. టీడీపీ నాయకుడు సుహేల్ బాషా ఫిర్యాదు మేరకు హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు.

Mithun Reddy Warning

A1గా ఎంపీ మిథున్ రెడ్డి, A2గా మాజీ ఎంపీ రెడ్డప్పతో సహా 34 మందిపై కేసు రిజిస్టర్‌‌ చేశారు. మరోవైపు రెడ్డప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు తొమ్మిది మందితో సహా మరికొందరు టీడీపీ నాయకులపైనా కేసు పెట్టారు.

ఇక దీనిపై మిథున్‌ రెడ్డి మాట్లాడారు. సిఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ డైరెక్షన్ లోనే పుంగనూరు లో దాడులు జరుగుతున్నాయని ఆరోపణలు చేశారు. పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధి అడ్డుకోవాలని కుట్రలో భాగమే అన్నారు. 5 వేల కోట్లతో ఎలక్ట్రికల్ కారు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే, దాన్ని రాకుండా కుట్రలు చేస్తున్నారని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news