జగన్ కు బాబు లేఖ.. ఆదుకోండి !

-

రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ఈ వర్షం ఎఫెక్ట్ కాస్త ఎక్కువగానే ఉన్నా ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఏపీలో కురుస్తున్న భారీ వర్షాల నేపధ్యంలో ఏపీ సిఎం జగన్ కు చంద్రబాబు లేఖ రాశారు. వర్షాల వలన ఆస్తి నష్టపోయిన వారిని, అలాగే ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదు కోవాలని జగన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. తడిసిన పంటలని, కనీస మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని లేఖలో బాబు కోరారు.

దెబ్బతిన్న పంటల నష్టాన్ని యుద్ద ప్రాతిపదికన అంచనా వేయాలని కోరిన చంద్రబాబు వర్షాల కారణంగా ఉపాధి కోల్పోయిన చేనేత, ఇతర చేతి వృత్తుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని కోరారు. మత్స్యకారులకు కూడా భారీ వర్షం వలన దెబ్బ తిన్న వలలు, పడవల కొనుగోళ్ల కోసం ఆర్ధిక సాయం చేయాలని కోరారు. వర్ష బాధితులకు తక్షణమే సహాయ చర్యలు అందించి వారిని ఆదుకోవాలని లేఖలో చంద్రబాబు కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news