ఏపీ వాలంటీర్లకు చంద్రబాబు బిగ్ షాక్ ?

-

ఏపీ వాలంటీర్లకు చంద్రబాబు బిగ్ షాక్ ఇచ్చింది. వైసీపీ నేతలు తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ మొరపెట్టుకున్న వాలంటీర్లకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక సూచన చేశారు. “మీతో ఎవరైతే బలవంతంగా రాజీనామా చేయించారో వారిపై స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయండి. అది అచ్చెన్నాయుడు చేయించినా సరే. కంప్లైంట్ చేయండి.

Chandrababu Sarkar removed Spandana’s name

ఆ తర్వాత నన్ను కలవండి. ఆలోచిద్దాం” అని ఆయన అన్నారు. అటు పలు నియోజకవర్గాల్లో వైసీపీ నేతలపై పోలీసులకు వాలంటీర్లు ఫిర్యాదులు చేస్తున్నారు. అటు దండం పెట్టి చెప్పాను విన్నారా ఇప్పుడు అనుభవించండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నీటి వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. రాజీనామా చేసిన వాలంటీర్ని తీసుకునే ప్రసక్తే లేదు… ఎంతోమందికి దండం పెట్టి మరీ చెప్పాను ఎవరు కూడా నా మాట వినలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేసిన మిమ్మల్ని క్షమించే ప్రసక్తే లేదన్నారు నీటి వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news