జగన్ ఆస్తి పంచితే.. 43 వేల మంది కోటీశ్వరులు అవుతారు – చంద్రబాబు

-

ఏపీ సీఎం జగన్‌ ఆస్తులపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పై 43 వేల కోట్లు అవినీతి పై సీబీఐ చార్జషీట్ వేసిందన్నారు. జగన్ ఆస్తి పంచితే 43 వేల మంది కోటీశ్వరులు అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి పులివెందుల ఎలా గెలుస్తావో చూస్తానని సీఎం జగన్‌ కు చంద్రబాబు హెచ్చరించారు. నిన్న మీడియాతో చంద్రబాబు నాయుడు మాట్లాడారు.

chandrababu naidu ys jagan

అమరావతి నిర్మాణానికి లక్ష కోట్లు కావాలి అని విష ప్రచారం చేశారు…ఒక్క రూపాయి ఇవ్వకుండా హైదరాబాద్ విమానాశ్రయం కట్టామన్నారు. సంపదను నాశనం చేసిన వ్యక్తి జగన్..అమరావతి లో అవినీతి జరిగిందని విష ప్రచారం చేశారని నిప్పులు చెరిగారు చంద్రబాబు.

జగన్ పై 43 వేల కోట్లు అవినీతి పై సీబీఐ చార్జషీట్ వేసిందన్నారు. జగన్ ఆస్తి పంచితే 43 వేల మంది కోటీశ్వరులు అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫేక్ సర్వే లు చే సి పాతిక ఎంపీ సీట్లు వస్తాయని దుష్ప్రచారం చేస్తున్నారు..సవాల్ విసురుతున్న ఈసారి పులివెందుల ఎలా గెలుస్తారో చూస్తానన్నారు చంద్రబాబు. కేసుల విషయంలో… టీడీపీ పార్టీ నేతలు గానీ, కార్యకర్తలు గానీ ఎవరూ భయపడకూడదని కోరారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news