ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు గుంటూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన

-

టిడిపి అధినేత చంద్రబాబు…ఉమ్మడి గుంటూరు జిల్లా పర్యటన ఖరారు అయింది. నేటి నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లాలో మూడు రోజులు పాటు పర్యటించనున్నారు టిడిపి అధినేత చంద్రబాబు. ఇందులో భాగంగా నేడు పలనాడు జిల్లా అమరావతి ప్రాంతంలో చంద్రబాబు పర్యటించనున్నారు.

అనంతరం ఇవాళ సాయంత్రం 4 గంటలకు వైకుంఠపురం నుండి అమరావతి వరకు రోడ్ షో లో పాల్గొంటారు చంద్రబాబు నాయుడు. అనంతరం ధరణికోటలో బహిరంగ సభలో పాల్గొననున్నారు చంద్రబాబు. ఈ తరుణంలోనే, చంద్రబాబు పర్యటనను పురస్కరించుకొని భారీ ఏర్పాట్లు చేశారు టిడిపి నాయకులు.

Read more RELATED
Recommended to you

Latest news