రాజంపేట, తంబళ్లపల్లిలో టీడీపీ ఓటమిపై చంద్రబాబు సీరియస్

-

రాజంపేట, తంబళ్లపల్లిలో టీడీపీ ఓటమిపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. . రాజంపేట, తంబళ్లపల్లిలో టీడీపీ ఓటమిపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. గెలిచే సీట్లను చేజర్చారంటూ చేజారంటూ అభ్యర్థులు సుగవాసి సుబ్రహ్మణ్యం, జయచంద్ర రెడ్డిలపై మండిపడ్డారు.

Chandrababu is serious about TDP’s defeat in Rajampet and Tamballapally

రాజంపేట టీడీపీకి కంచుకోట అని…. తాను, పవన్, లోకేష్ వచ్చి ప్రచారం చేసిన ఓటమి చెందామని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పరాజయానికి గల కారణాలను అధినేతకు అభ్యర్థులు వివరించారు. ఇకపై పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని వారికి చంద్రబాబు సూచించారు.

అటు వైసీపీ నేతలు తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ మొరపెట్టుకున్న వాలంటీర్లకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక సూచన చేశారు. “మీతో ఎవరైతే బలవంతంగా రాజీనామా చేయించారో వారిపై స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయండి. అది అచ్చెన్నాయుడు చేయించినా సరే. కంప్లైంట్ చేయండి. ఆ తర్వాత నన్ను కలవండి. ఆలోచిద్దాం” అని ఆయన అన్నారు. అటు పలు నియోజకవర్గాల్లో వైసీపీ నేతలపై పోలీసులకు వాలంటీర్లు ఫిర్యాదులు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news