చంద్రబాబు కరకట్ట ప్రకాష్ రాజ్ – మంత్రి అంబటి రాంబాబు

-

టీటీడీలో శ్రీవాణి ట్రస్ట్ గురించి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి అంబటి రాంబాబు. శ్రీవాణి ట్రస్ట్ లో ఒక్క పైసా అవినీతి జరిగే ప్రసక్తి లేనే లేదన్నారు. పవన్ కళ్యాణ్ చెప్పులు పోగొట్టుకున్నట్టు బట్టలు కూడా పోగొట్టుకుంటాడని ఎద్దేవా చేశారు. పవన్ కి చెప్పులు త్వరగా దొరికితే ఆయన హైదరాబాద్ కి వెళ్ళిపోతారని అన్నారు.

వారాహి అంటే అమ్మవారి పేరు అని.. అమ్మవారి పేరుతో ఉన్న వాహనం ఎక్కి పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలు ఏవి హిట్ కావు అని.. ఇది అమ్మవారి శాపం అని అన్నారు. ద్వారంపూడిని కొడతానంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడని.. నువ్వు అంత మగాడివా.? అని ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తున్నాడా..? రౌడీయిజం చేస్తున్నాడా..? అని నిలదీశారు. ఇక చంద్రబాబు నాయుడు కరకట్ట ప్రకాష్ రాజ్ అని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ స్పీచ్ మొత్తం బాబు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ ఏ నని ఆయన అన్నారు. చంద్రబాబు ఎవరికో పుట్టిన బిడ్డను ఎత్తుకున్న వ్యక్తి అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news