దోచేసిన డబ్బు జేబులోకి ఎలా తెచ్చుకోవాలో చంద్రబాబుకు బాగా తెలుసు – సీఎం జగన్

-

ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రసంగిస్తూ స్కిల్ డెవలప్మెంట్ స్కాం ను ప్రస్తావిస్తూ చంద్రబాబుపై, గత టిడిపి ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. దేశ చరిత్రలోనే స్కిల్ డెవలప్మెంట్ స్కాం అతిపెద్దదని స్పష్టం చేశారు. విద్యార్థుల పేరుతో జరిగిన అతిపెద్ద స్కామ్ ఇది అని తెలిపారు సీఎం జగన్. నైపుణ్య అభివృద్ధి పేరుతో ఏకంగా డబ్బులు దోచేయడం చంద్రబాబుకు మాత్రమే తెలిసిన గొప్ప కళ అని ఎద్దేవా చేశారు.

ఈ స్కీం ద్వారా 371 కోట్లు హారతి కర్పూరంలా మాయం చేశారని ఆరోపించారు. ఈ స్కామ్ కి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయన్నారు సీఎం జగన్. ఈ డబ్బు షెల్ కంపెనీల ద్వారా రకరకాల మార్గాలలో వెళ్లి తిరిగి ఆ షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు వద్దకు వచ్చిందన్నారు. దోచేసిన డబ్బు జేబులోకి ఎలా తెచ్చుకోవాలో చంద్రబాబుకు బాగా తెలుసని అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఈ స్కాం ఊపిరి పోసుకుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news