పులివెందులలో టీడీపీ జెండా ఎగురవేసేందుకు.. చంద్రబాబు స్కెచ్

-

పులివెందులలో టీడీపీ జెండా ఎగురవేయాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చాలా ఆతృతగా ఉన్నారు. ఇందులో భాగంగానే తాజాగా నియోజకవర్గ ఇంచార్జ్ ల తో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముఖాముఖీ భేటీలు అయ్యారు. ఈ సందర్భంగా పులివెందుల, వెంకటగిరి, నూజివీడు, తుని, పాడేరు, పాలకొండ నియోజకవర్గాల ఇంచార్జ్ లతో సమీక్ష చేశారు.

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, పాలనా తీరు, విద్వేష రాజకీయాల కారణంగా తనను ఎన్నుకున్న పులివెందులకూ జగన్ చెడ్డపేరు తెచ్చారని ఫైర్‌ అయ్యారు. ఒక్క చాన్స్ నినాదంతో వచ్చిన జగన్ రెడ్డికి అదే చివరి చాన్స్ అవుతుందని..రివర్స్ పాలనతో సొంత నియోజకవర్గ ప్రజల నుంచి కూడా వ్యతిరేకత తెచ్చుకున్నారని వెల్లడించారు.

వివేకా హత్యపై సమాధానం చెప్పలేక, విద్వేష రాజకీయాల కారణంగా ముఖ్యమంత్రి నైతికంగా పతనం అయ్యాడని..బాబాయ్ హత్య కేసులో స్వయంగా ముఖ్యమంత్రి దోషులను కాపాడడం పులివెందుల ప్రజలకు కూడా మింగుడు పడడంలేదని పేర్కొన్నారు. రివ్యూల అనంతరం నేతల పనితీరులో మార్పు వచ్చిందా లేదా అనే అంశంపైనా సమాచారం తెప్పించుకుంటున్నా, ప్రజా సమస్యలపై పోరాటం, పార్టీ కార్యక్రమాల నిర్వహణ లో నేతల వేగం పెరగాలని స్పష్టం చేశారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు.

 

Read more RELATED
Recommended to you

Latest news