సెల్‌ ఫోన్లే టీడీపీ ఆయుధాలు…అన్యాయాలను బయట పెట్టండి : కార్యకర్తలకు చంద్రబాబు పిలుపు

-

సెల్‌ ఫోన్లే టీడీపీ ఆయుధాలు…వీడియోలు తీయండని కార్యకర్తలకు చంద్రబాబు పిలుపు నిచ్చారు. టీడీపీ కార్యాలయంలో ఐటీడీపీ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..సామాజిక మాధ్యమానికి ఉన్న శక్తి ఏపాటిదో అందరూ తెలుసుకోవాలని..సెల్‌ ఫోన్లే ఐటీడీపీ కార్యకర్తల ఆయుధాలు అన్నారు. నిజాలను వెలికితీయటంలో ఐటీడీపీ కార్యకర్తలు చురుగ్గా పనిచేయాలని.. 25 ఏళ్ల క్రితం సెల్‌ ఫోన్‌ల గురించి మాట్లాడితే నన్ను ఎగతాళి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ తిండిలేకున్నా ఉండగలుగుతున్నారు కానీ.. సెల్‌ ఫోన్‌ లేకుండా ఉండలేకపోతున్నారని అన్నారు.

chandrababu
chandrababu

చేతకానివాడే కుల, మత, ప్రాంతాల గురించి మాట్లాడతాడని… సమర్థులు మాత్రమే అభివృద్ధి గురించి మాట్లాడతారని చెప్పారు. గాడిదకు గుర్రానికి తేడా తెలియని వాళ్లు అధికారంలోకి వచ్చారన్నారు. అవాస్తవాలను నిజాలు చేయటంలో పేటీఎం బ్యాచ్‌దే కీలక పాత్ర అని.. అధికారంలో ఉండగా.. పని ధ్యాసలో పడి వైసీపీ చేస్తోన్నకుట్రలను పట్టించుకోలేదని పేర్కొన్నారు.

వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లి జగనుకు అడ్రెస్ లేకుండా చేసి ఓడించాల్సిన బాధ్యత ఐటీడీపీ కార్యకర్తలదేనని.. బాబాయిని గుండెపోటు పేరు చెప్పి గొడ్డలిపోటు వేశారని ఆగ్రహించారు. సిగ్గు లేకుండా సీబీఐపైనా ఎదురుదాడికి దిగారని… ఏ సినిమాలోనూ చూడని విధంగా బాబాయిని హత్య చేశారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news