జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో ముఖ్య‌మంత్రి కేసీఆర్ భేటీ

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంతి కేసీఆర్‌ ప్రస్తుతం జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే వరుసగా జాతీయ నాయకుల, ఇతర రాష్ట్రాల సీఎంలతో సమావేశం అవుతున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ తో తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ సమావేశం అయ్యారు.

కాసేపటి క్రితమే.. ఢిల్లీ నుంచి జార్ఖండ్‌ చేరుకున్న సీఎం కేసీఆర్‌.. ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ తో సమావేశం అయ్యారు. సీఎం కేసీఆర్‌ తో సహా.. టీఆర్‌ఎస్‌ నేతలు వినోద్‌ కుమార్‌, మంత్రి శ్రీనివాస్‌ గౌడ్, సంతోష్‌ కుమార్‌, కవిత, ఇతరులు ఈ సమావేశంలో పాల్గొన్న వారిలో ఉన్నారు.

ఇక ఈ సమావేశంలో.. దేశ రాజకీయాలు, థర్డ ఫ్రంట్, భవిష్యత్తు రాజకీయాలు ఇలా చాలా అంశాలపై సీఎం కేసీఆర్‌, హేమంత్‌ చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం.. గల్వాన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు కేసీఆర్‌ ఆర్థిక సహాయం అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news