ఏం బతుకయ్యా జగన్ రెడ్డీ – చంద్రబాబు సీరియస్

-

ఏం బతుకయ్యా జగన్ రెడ్డీ అని ఫైర్‌ అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల టీడీపీ అభ్యర్థి రామగోపాల్ రెడ్డి అక్రమ అరెస్ట్ పై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఘాటు వ్యాఖ్యలతో టీడీపీ అధినేత ట్వీట్ చేశారు.

ఏం బతుకయ్యా జగన్ రెడ్డీ..ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి కి డిక్లరేషన్ ఇవ్వకుండా ఒత్తిడి చేసి అడ్డుపడతావా? అని నిప్పులు చెరిగారు చంద్రబాబు. పులివెందుల టీడీపీ నేత రామగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ గా గెలిచాడని అక్కసుతో ఆర్థరాత్రి అరెస్టు చేస్తావా? ఇంతకంటే నువ్వు ఇంకేం బ్రష్టుపట్టిపోవాల్సింది ఉంది? అని ఆగ్రహించారు. ప్రజా తీర్పును గౌరవించి క్షమాపణ కోరు! అంటూ చురకలు అంటించారు చంద్రబాబు. డిక్లరేషన్ అడిగిన రామగోపాల్ రెడ్డిని రాత్రి కౌంటింగ్ సెంటర్ వద్ద అరెస్ట్ చేసిన వీడియో ను ట్వీట్ కు జతచేశారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news