ఏపీ ప్రజలకు శుభవార్త..చంద్రన్న బీమా రూ. 10 లక్షలకు పెంపు !

-

ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రకటించారు. చంద్రన్న బీమా పరిహారాన్ని రూ. 3 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచుతున్నట్లు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రకటించారు.

Chandranna Insurance Rs 10 lakhs increase

త్వరలో పాత్రికేయులని, న్యాయవాదులను కూడా చంద్రన్న బీమా కిందకు తీసుకొస్తామని చెప్పారు. గత వైసీపీ సర్కార్ పథకం పేరు మార్చడమే కాక, ఎంతోమందికి పరిహారాన్ని నిలిపేసిందని ఆరోపించారు. కార్మికులు కార్మిక శాఖలో రూ. 15 చెల్లించి ఈ పథకంలో చేరవచ్చని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రకటించారు.

కాగా ఏపీ మంత్రివర్గ సమావేశం వెలగపూడిలోని సచివాలయంలో ఈరోజు జరగనుంది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి సమావేశం ఇదే. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులను తెలియజేసేలా శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news