Kurnool: ఇవాళ ఇంటికి వెళ్లి పింఛన్ పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు

-

నేడు సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు పర్యటనలో మార్పు జరిగింది. పత్తికొండ మండలం పుచ్చకాయలమాడ పర్యటన రద్దు చేసుకున్నారు బాబు. ఓర్వకల్ లో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.

ఇందులో భాగంగానే.. ఇవాళ మధ్యాహ్నం 1.30కి ప్రత్యేక విమానంలో ఓర్వకల్ ఎయిర్ పోర్ట్ కి చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు. 1.50 కి ఓర్వకల్ లో ఇంటికి వెళ్లి పింఛన్ పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు… స్థానికులతో చంద్రబాబు ముఖాముఖి ఉంటుంది. ఇక ఇవాళ మధ్యాహ్నం 3.50కి కర్నూలు ఎయిర్ పోర్ట్ నుంచి హైద్రాబాద్ కి బైల్దేరనున్నారు చంద్రబాబు.

  • తెల్లవారు జాము నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షమ్ల పంపిణీ ప్రారంభం.
  • మొత్తం 64,61,485 పెన్షన్ లబ్దిదారులకు రూ. 2729.86 కోట్లను పంపిణీ చేయనున్న కూటమి సర్కార్.
  • ఇప్పటి వరకు 33.76 శాతం మేర పెన్షన్ల పంపిణీ చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది.
  • పెన్షన్ల పంపిణీలో టాప్-3లో నిలిచిన శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం జిల్లాలు.
  • చివరి స్థానంలో అల్లూరి జిల్లా.

Read more RELATED
Recommended to you

Latest news