జగన్‌ మీ బిడ్డ.. మీ బిడ్డకు నిజాయితీ ఉంది – సీఎం జగన్‌

-

జగన్‌ మీ బిడ్డ.. మీ బిడ్డకు నిజాయితీ ఉందని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. ఏలూరులోని గణపవరం లో వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ కార్యక్రమం లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి జగన్. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. జగన్‌ మీ బిడ్డ. రైతుల తరఫున నిలబడే బిడ్డ. ఎన్నికలప్పుడు ఒకలా ? ఎన్నికలు అయిన తర్వాత మరో మాదిరిగా ఉండేవాడు కాదు జగన్ అంటూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. మీ బిడ్డకు నిజాయితీ ఉంది.. మీ బిడ్డకు నిబద్ధత ఉంది. ఏది చెబుతాడో.. అదే చేస్తాడన్నారు సీఎం జగన్‌.

మూడేళ్లలో ఎక్కడ కరువు లేదు.. ఒక్కమండలం కూడా కరువు మండలం గా ప్రకటించలేదని గుర్తు చేశారు. రైతుల పరామర్శ కి వెళ్తున్న దత్త పుత్రుడు పట్టాదారు పాసు బుక్కు వుండి నష్టపోయిన ఒక్కరినీ చుపించలేకపోయారన్నారు. రైతుల విషయంలో గత ప్రభుత్వాలకు ఎంత ప్రేమ వుంది.. వైసీపీ ప్రభుత్వానికి ఎంత ప్రేమ వుందో రైతులు గుర్తించాలని కోరారు.

ఆత్మ హత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఏడున్నర లక్షలు ఇస్తున్నామని.. రైతులకు మేలు చేయాలంటే రైతుల జీవనవిధానం, సంస్కృతి పై అవగాహన ఉండాలి.. అలాంటి అవగాహన లేని ప్రభుత్వాలను గతం లో చూశామని పేర్కొన్నారు. రైతులకు ఉచిత కరెంట్ వద్దు, వ్యవసాయం దండగ అంటూ రైతుల పై కాల్పులు చంపేసింది చంద్రబాబు అని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news