రేపు సీఎం వైఎస్‌ జగన్‌ ఏలూరు జిల్లా దెందులూరు పర్యటన

-

రేపు సీఎం వైఎస్‌ జగన్‌ ఏలూరు జిల్లా దెందులూరు పర్యటించనున్నారు. వైఎస్సార్‌ ఆసరా ఆర్ధిక సాయాన్ని విడుదల చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌..ఈ సందర్భంగా ఏలూరు జిల్లా దెందులూరు పర్యటించనున్నారు.

ఇందులో భాగంగానే.. రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి.. 10.30 గంటలకు దెందులూరు చేరుకుంటారు సీఎం జగన్. 10.50 – 12.35 బహిరంగ సభలో వైఎస్సార్‌ ఆసరా ఆర్ధిక సాయాన్ని విడుదల చేయనున్న సీఎం వైఎస్‌ జగన్.. మధ్యాహ్నం 1.35 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.

ఇక అటు శాప్ వివాదంపై సీఎం జగన్ కు ఫిర్యాదు చేశారు. బైరెడ్డిపై చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ కు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు ఒలంపిక్ అసోసియేషన్ సెక్రటరి కేపీరావు. శాప్ మిటింగ్ లో ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ , క్రిడాకారులకు ఇస్తున్న ప్రోత్సాహాన్ని అభినందించినట్టు తెలిపినట్టు లేఖలో రాశారు కేపీరావు.

Read more RELATED
Recommended to you

Latest news