ఈనెల 9న గుడివాడకు సీఎం జగన్

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణాజిల్లా గుడివాడ పర్యటన ఖరారు అయింది. ఈ నెల 9వ తేదీన గుడివాడలో పర్యటించానున్నారు సీఎం జగన్. ఈ పర్యటనలో భాగంగా లబ్ధిదారులకు టిడ్కో ఇళ్ల పంపిణీ చేయనున్నారు. 900 కోట్లతో పూర్తిస్థాయి మౌలిక వసతులతో టిడ్కో లే అవుట్ అభివృద్ధి చేశారు. ఇక సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో గుడివాడలో సమీక్ష నిర్వహించారు మంత్రి జోగి రమేష్.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 30 వేల మందికి నీడనిచ్చే బృహత్తర కార్యక్రమాన్ని గుడివాడలో ప్రారంభించబోతున్నామన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సీఎం జగన్ చేతుల మీదుగా టిడ్కో ఫ్లాట్లు ప్రారంభం చేయనున్నట్లు తెలిపారు. ఇక సీఎం జగన్ ఓవైపు వివిధ శాఖలపై సమీక్ష, సమావేశాలు నిర్వహిస్తూనే.. మరోవైపు జిల్లాలను కూడా చుట్టేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలపై సమీక్షలు నిర్వహిస్తూ కీలక సూచనలు చేస్తున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news