ఇవాళ విజయవాడలో పర్యటించనున్న సీఎం జగన్‌

-

 

ఇవాళ విజయవాడలో ఏపీ సీఎం వైయస్‌.జగన్‌ పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే… ఇవాళ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి విజయవాడ వెళ్లనున్నారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. అనంతరం విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలోని మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ నిర్మల్‌ హృదయ్‌ భవన్‌ను సందర్శించనున్నారు సీఎం వైయస్‌.జగన్‌.

ఆ తర్వాత 10.10 గంటల నుంచి 10.40 వరకు అనాధ పిల్లలతో ముచ్చటించనున్న ముఖ్యమంత్రి…అనంతరం తాడేపల్లికి తిరిగి రానున్నారు. అటు సీఎం జగన్ గుంటూరు పర్యటన ఖరారైంది. జూన్ 2న గుంటూరులో పర్యటించనున్న సీఎం… వైయస్సార్ యంత్ర సేవా పథకం రెండో మెగామేళా నిర్వహణలో పాల్గొన్నారు. ఈ మేళాలో భాగంగా 793 ట్రాక్టర్లు, 38 హార్వెస్టర్లను రైతులకు అందించనున్నారు. ఈ వేదిక ద్వారా గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, బాపట్ల, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, ప్రకాశం జిల్లాల రైతులకు ట్రాక్టర్లు పంపిణీ చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news