ఏపీ ప్రజలకు శుభవార్త..ఇవాళ 146 అంబులెన్స్‌లను ప్రారంభించనున్న సీఎం జగన్‌

-

ఏపీ ప్రజలకు శుభవార్త.. ఇవాళ 146 అంబులెన్స్‌లను ప్రారంభించనున్నారు ఏపీ సీఎం జగన్‌. ఇవాళ 146 అంబులెన్స్‌లను తాడేపల్లి క్యాంపు కార్యాలయం దగ్గర జెండా ఊపి ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి.

ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 10 గంటలకు క్యాంపు కార్యాలయం దగ్గర కార్యక్రమం జరుగనుంది. కొత్త అంబులెన్స్‌ల కోసం రూ.34.79 కోట్లు ఖర్చు చేసింది ఏపీ ప్రభుత్వం. 108 సేవల కోసం ఏటా ప్రభుత్వం రూ.188.56 కోట్లు…వెచ్చిస్తోంది.

కాగా, రేపు సీఎం వైఎస్‌ జగన్‌ చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు విజయా డెయిరీ వద్ద అమూల్‌ సంస్ధ ఏర్పాటు చేసే నూతన యూనిట్‌కు భూమిపూజ, పోలీస్‌ పెరేడ్‌ మైదానంలో జరిగే బహిరంగ సభలో సీఎం జగన్‌ పాల్గొనున్నారు. అనంతరం క్రిస్టియన్‌ మెడికల్‌ కళాశాల (సీఎంసీ) ఆవరణలో 300 పడకల ఆస్పత్రికి భూమి పూజ చేయానున్నారు సిఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news