మోడీ సభకు బీజేపీ అధ్యక్షుడిగా వస్తానో లేదో – బండి సంజయ్

-

మోడీ సభకు బీజేపీ అధ్యక్షుడిగా వస్తానో లేదో అంటూ తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా.. బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ కుమార్‌ ను మార్చుతారన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే.. తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్‌లో ఈనెల 8న జరనున్న మోడీ సభకు బీజేపీ అధ్యక్షుడిగా వస్తానో లేదో అంటూ కార్యకర్తల దగ్గర బండి సంజయ్ భావోద్వేగానికి గురయ్యారు. అయితే.. దీనిపై బీజేపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ ఈ స్థాయిలో ఉందంటే మీరే కారణం, అధ్యక్షుడిగా మీరే కొనసాగాలి అంటూ కంటతడి పెట్టుకున్నారు బీజేపీ కార్యకర్తలు.

Read more RELATED
Recommended to you

Latest news