సీఎం జగన్‌ 4వ రోజు బస్సు యాత్ర.. షెడ్యూల్‌ ఇదే

-

సీఎం జగన్‌ 4వ రోజు బస్సు యాత్ర ఇవాళ కొనసాగనుంది. జగన్‌ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం – 4వ రోజు శనివారం షెడ్యూల్ ఒకసారి పరిశీలిద్దాం. ఈ యాత్రలో భాగంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉదయం 9 గంటలకు పత్తికొండలోని రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరుతారు. రాతన మీదుగా తుగ్గలి చేరుకుంటారు.

CM Jagan’s bus trip from 27th of this month

ఉదయం 10 గంటలకు గ్రామస్థులతో ముఖముఖి కార్యక్రమంలో పాల్గొంటారు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. అనంతరం జొన్నగిరి, గుత్తి మీదుగా ప్రయాణించి గుత్తి శివారులో భోజనవిరామం తీసుకుంటారు. సాయంత్రం 3 గంటలకు బయలుదేరి పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్, రాప్తాడు బైపాస్ , ఆకుతోటపల్లి , సంజీవపురం శివారు వరకు బస్ యాత్ర కొనసాగుతుంది. సంజీవపురం శివారులో రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news