ఏపీలో బీజేపీ పాత్ర ఉన్న ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది -సీఎం రమేష్

-

ఏపీలో బీజేపీ పాత్ర ఉన్న ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని హాట్‌ కామెంట్స్‌ చేశారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్. ఏపీలో బీజేపీ పాత్ర ఉన్న ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని.. పొత్తులపై రాష్ట్ర స్థాయిలో మాట్లాడే అధికారం ఎవరికీ లేదు, నాతో సహా ఎవరు మాట్లాడిన అది వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని తెలిపారు.


సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని కేంద్ర నాయకత్వం స్పష్టంగా చెప్పేసిందని.. అమిత్ షా-చంద్రబాబు భేటీ వెనుక ఆంతర్యం వాళ్లే చెప్పాలని ఆగ్రహించారు. చాలా మంది నాయకులు షాతో భేటీ అవుతారు…తొమ్మిదేళ్ల కేంద్ర ప్రభుత్వం విజయాల పై రైల్వే గ్రౌండ్లో బహిరంగ సభ ఉంటుందని ప్రకటించారు సీఎం రమేష్. శక్తి కేంద్రాల ముఖ్యులతో అమిత్ షాతో సమావేశం కానున్నారని…హోంమంత్రి సభకు 50వేల మంది హాజరవుతారని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news