ఇవాళ ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన..షెడ్యూల్ ఇదే

-

సీఎం వైఎస్‌ జగన్‌.. ఇవాళ ప్రకాశం జిల్లా మార్కాపురం పర్యటనకు వెళ్లనున్నారు. వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు సీఎం జగన్‌ మోహన్ రెడ్డి. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.

 


పది గంటల ప్రాంతంలో మార్కాపురం కు వెళ్లనున్నారు వైఎస్‌ జగన్‌. ఎస్‌వీకేపీ డిగ్రీ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో బహిరంగ సభా వేదిక వద్ద వివిధ అభివృద్ది పనులకు శంకుస్ధాపనలు చేయనున్నారు వైఎస్‌ జగన్‌. అనంతరం బహిరంగ సభలో ప్రసంగం ఉండనుంది. అనంతరం ఈబీసీ నేస్తం లబ్ధిదారులకు నగదు జమచేయనున్న వైఎస్‌ జగన్‌… ఇవాళ మధ్యాహ్నం 1.35 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news