మంత్రికి షాక్ ఇచ్చిన కరోనా బాధితులు…!

-

కరోనా రావడం అంటే నిజంగా నరకం అనే విషయం ఇప్పుడు స్పష్టంగా అర్ధమవుతుంది. ఆస్పత్రుల్లో వైద్య సేవల విషయంలో తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతుంది. తాజాగా విశాఖలో తమ పరిస్థితిపై కరోనా రోగులు మంత్రి అవంతి శ్రీనివాస్ కి షాక్ ఇచ్చారు. విమ్స్ కోవిడ్ ఆసుపత్రిని సందర్శించడానికి గానూ మంత్రి అవంతి వెళ్ళారు. తమ సౌకర్యాలపై వైద్య శాఖ అధికారులను మంత్రిని నిలదీశారు.

సరైన వైద్య సదుపాయాలు అందడం లేదంటూ వాపోయిన బంధువులు… చనిపోయిన వారి సమాచారం కూడా ఇవ్వడం లేదని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. సిబ్బంది లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నామని… కోవిడ్ రోగుల బంధువులు అసహనం వ్యక్తం చేసారు. వారికి మంత్రి సహా అక్కడ ఉన్న అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా సరే ఫలితం లేకుండా పోయింది.

Read more RELATED
Recommended to you

Latest news