జగన్‌ ఓ రోబో లాంటోడు..ఏపీలో కేసీఆర్‌ కున్న క్రేజ్‌ కూడా లేదు – సిపిఐ నారాయణ

-

జగన్‌ ఓ రోబో లాంటోడు..ఏపీలో కేసీఆర్‌ కున్న క్రేజ్‌ కూడా లేదని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు సిపిఐ నారాయణ. సిఎంకు ఎలాంటి ఆస్తులు లేక పోతే సంతకం పెట్టి ఇవ్వు.. జీతాలు ఇవ్వలేని దివాళా స్థాయిలో ఏపీ ఆర్థిక పరిస్థితి ఉందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను డంప్ కేంద్రంగా మోదీ మార్చుతున్నారు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ను వైసీపీ ప్రభుత్వం ఎందుకు ఆపడం లేదని ఆగ్రహించారు.

అదానీకి నొప్పి తగలకుండా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తంన్నారు.. విభజన చట్టాలను అమలు చేయించుకోలేని బలహీన స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారన్నారు. ఎలాంటి సెంటిమెంట్స్ లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి… రాజన్న రాజ్యం అని అధికారంలోకి వచ్చాక దోపిడీ రాజ్యంలా పాలన వచ్చిందని నిప్పులు చెరిగారు. జగన్మోహన్ రెడ్డికి అన్ని తెలిసే జరుగుతున్నాయని.. విశాఖ స్టీల్ ప్లాంట్ పై సజ్జల వ్యాఖ్యలు దురదృష్టకరం అన్నారు. బాగా సంపాదించిన తిమింగళాలకు సజ్జల కాపలాదారుడు అని.. దోపిడిదారులకు సజ్జల అధికారప్రతినిధి అని ఆగ్రహించారు సిపిఐ నారాయణ.

Read more RELATED
Recommended to you

Latest news