మురికిగుంటలో చేపలు పట్టుకునే జగన్ – సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కుప్పం పర్యటనలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సీఎం జగన్ ను నియంతగా పేరుందిన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తో పోల్చిన విషయం తెలిసిందే. అయితే సీఎం జగన్ ను కిమ్ తో పోల్చడం సిపిఐ నారాయణకు ఏమాత్రం నచ్చలేదు.

చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కిమ్ కు వైయస్ జగన్కు మధ్య నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు సిపిఐ నారాయణ. అమెరికా లాంటి సామ్రాజ్యవాధాన్ని కిమ్ గడగడలాడించారని.. మురికిగుంటల్లో చేపలు పట్టుకునే జగన్ లాంటి వాళ్ళతో కిమ్ ను పోల్చడం సరికాదని తప్పుపట్టారు.

కుప్పంలో చంద్రబాబును అడ్డుకోవాలనుకోవడం తగదని అన్నారు నారాయణ. సంక్షేమ పథకాలు అందిస్తున్నాం అంటున్న జగన్ కు భయం ఎందుకని ప్రశ్నించారు. బెదిరించి భయపెట్టి వైసిపి పాలన చేయాలనుకుంటుందని.. హత్య రాజకీయాలను వైసీపీ ప్రోత్సహిస్తుందని ఆరోపించారు నారాయణ.

Read more RELATED
Recommended to you

Latest news