సీఎం జగన్ తో క్రికెటర్ అంబటి రాయుడు భేటీ

-

క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయాలలోకి వస్తానని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు అంబటి రాయుడు. తాజాగా నేడు సాయంత్రం తాడేపల్లి లోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య దాదాపు గంట పాటు చర్చలు జరిగాయి. జగన్ తో భేటీ అనంతరం అంబటి రాయుడు అక్కడి నుండి ఇంటికి బయలుదేరారు. ఇటీవల క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు.. తనలో రెండో కోణాన్ని త్వరలోనే చూస్తారని ఈమధ్య ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

తాజాగా ముఖ్యమంత్రి జగన్ ని కలవడంతో ఆయన వైసీపీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. గుంటూరు జిల్లా పొన్నూరు కు చెందిన అంబటి రాయుడు వైసీపీలో చేరి అక్కడి నుండి వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు జనసేన లో చేరుతారని గతంలో ప్రచారం జరిగినప్పటికీ.. తాజాగా సీఎం జగన్ తో భేటీ కావడంతో వైసీపీలో చేరబోతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news