దారుణం: ముస్లిం అన్నదమ్ముల ప్రేమకు నో చెప్పిన పేరెంట్స్… శవమై తేలిన అక్కాచెల్లెళ్లు

-

నేటి రోజుల్లో ప్రేమలో విఫలం కావడం అనే కారణంతో ఎందరో అమాయక యువతీయువకులు ప్రాణాలను కోల్పోతున్నారు . ఒకరిని ఒకరు సరిగా అర్ధం చేసుకోకుండా ఉండడం మరియు పేరెంట్స్ తమ ప్రేమకు ఒప్పుకోకపోవడం లాంటి వాటి వలన కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా తమిళనాడు రాష్ట్రంలో ఇలాంటి ఒక ఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే తిరుచ్చి జిల్లాకు చెందిన గాయత్రి మరియు విద్య అనే అక్క చెల్లెల్లు ఒక గార్మెంట్ ఫ్యాక్టరీ పనిచేస్తున్నారు. అయితే వీరిద్దరూ ఒకే ఇంటికి చెందిన ముస్లిం సోదరులను ప్రేమిస్తున్నారు. ఈ ప్రేమ తతంగం చాలా కాలం నుండి జరుగుతూ ఉంది. అయితే ఈ విషయం తెలుసుకున్న అమ్మాయిల తల్లితండ్రులు ఇలా చేయడం కరెక్ట్ కాదని వెంటనే ఇలాంటి పనిని మానేయాలని మందలించడంతో మనస్థాపం చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

 

పిల్లల ప్రేమను అర్ధం చేసుకోకుండా వారి నిండు ప్రాణాలు పోవడానికి ప్రధాన కారణమయ్యారు కసాయి తల్లితండ్రులు.

Read more RELATED
Recommended to you

Latest news