పరదాలు కట్టుకొని తిరిగే ముఖ్యమంత్రి ఎవరంటే వచ్చేది జగన్ రెడ్డి పేరే – ధూళిపాళ్ల

-

పరదాలు కట్టుకొని తిరిగే ముఖ్యమంత్రి ఎవరని పోల్ పెడితే వచ్చే పేరు జగన్ రెడ్డి దేనని సెటైర్ వేశారు టిడిపి సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్ర. గతంలో దొంగలు, బందిపోట్లను చూసి భయపడే జనం నేడు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పర్యటన అంటే భయపడుతున్నారని అన్నారు. జగన్ పర్యటన అంటేనే అన్నింటిని బలవంతంగా మూసేస్తున్నారని.. చివరకు మెడికల్ షాపులను కూడా బలవంతంగా మూసివేయడం దౌర్భాగ్యం అన్నారు.

సీఎం జగన్ సభకు రాకపోతే సంక్షేమ పథకాలను ఆపివేస్తామని బెదిరిస్తున్నారని విమర్శించారు. సభకు వచ్చిన ప్రజలు బయటకి వెళ్ళిపోకుండా గేట్లకు తాళాలు వేస్తున్నారని అన్నారు. సీఎం జగన్ కుప్పం పర్యటనకు వచ్చిన ప్రజలను ఇతర ప్రాంతాల నుంచి తరలించారని చెప్పారు. బీసీల మీద అంత ప్రేమ ఉన్న జగన్ చిత్తూరు జిల్లాలో బీసీలకు మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. జగన్ వద్ద పెద్ద మొత్తంలో అక్రమ సంపాదన ఉంది కాబట్టే బెంగళూరు, హైదరాబాద్, ఇడుపులపాయ, తాడేపల్లిలో ప్యాలెస్ లు ఉన్నాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news