డా. సుధాకర్ డిశ్చార్జ్‌ : ఏపీ హైకోర్టు తీర్పు..!

-

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన డా. సుధాకర్‌ ఘటన అందరినీ ఒక్కసారిగా షాక్ కి గురిచేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఘటనపై ఎన్నో కథనాలు వచ్చాయి. కాగా, గత నెల 16 నుంచి విశాఖ ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో డా.సుధాకర్‌కు చికిత్స అందిస్తోన్న విషయం తెలిసిందే. సుధాకర్‌ను అరెస్టు చేయలేదని, అలాంటప్పుడు తన కుమారుడిని ఏ ప్రాతిపదికన ఆసుపత్రిలో బంధించారని ప్రశ్నిస్తూ ఆయన తల్లి హైకోర్టులో వేసిన హెబియస్‌ కార్పస్‌ హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ ను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఈ రోజు విచారించి, సుధాకర్‌ను డిశ్చార్జ్‌ చేయడానికి అనుమతి ఇచ్చింది. ఆ ఆసుపత్రి సూరింటెండెంట్‌ ను సంప్రదించి ఆయన ఎప్పుడైనా డిశ్చార్జ్‌ కావచ్చని తెలిపింది. అలాగే, ప్రస్తుతం కొనసాగుతోన్న సీబీఐ విచారణకు ఆయన సహకరించాలని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news