ఏపీలో ఎంసెట్ వాయిదా… ఎప్పటి వరకంటే

-

దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా విద్యా వ్యవస్థ పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావనే చెప్పాలి. చాలా వరకు కూడా విద్యా వ్యవస్థ నానా ఇబ్బందులు పడుతూ వస్తుంది. పలు రకాల పరీక్షలను కూడా ఇప్పుడు రద్దు చేయడం వాయిదా వేయడం జరుగుతుంది. తాజాగా ఏపీలో కీలకమైన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ఎంసెట్ ని వాయిదా వేసారు.

అన్ని కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లను వాయిదా వేస్తున్నామని… సెప్టెంబర్ మూడో వారానికి ఎంసెట్ పరీక్షను వాయిదా వేస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. పరిక్షల తేదీలను తర్వాత ప్రకటిస్తామని మంత్రి వివరించారు. దేశ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు కారణంగా పలు రాష్ట్రాల్లో పరీక్షలను వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈ నిర్ణయంతో ఇంజనీరింగ్ విద్యా సంవత్సరం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news