రావులపాలెంలో ఫైనాన్స్ వ్యాపారిపై కాల్పులు

-

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రావులపాలెంలో ఆదివారం రాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. ఫైనాన్స్‌ వ్యాపారి సత్యనారాయణరెడ్డిపై ఇద్దరు దుండగులు దాడి చేశారు.  ఈ క్రమంలో ఆయన కుమారుడు ఆదిత్యరెడ్డి దుండగులను ప్రతిఘటించారు. దీంతో దుండగులు గాల్లోకి కాల్పులు జరిపారు.

బాధితులు కేకలు వేయడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. దుండగులు పారిపోతుండగా వారి వద్ద నుంచి ఓ సంచి పడిపోయింది. దాన్ని పరిశీలించగా అందులో 2 నాటు బాంబులు, జామర్‌ ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. ఘటనాస్థలంలో సీసీకెమెరాలు ఏమైనా ఉన్నాయేమో పరిశీలిస్తున్నారు. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news