ఏపీలో BRS పార్టీ కార్యాలయం వద్ద ఫ్లెక్సీలు చింపివేత

-

ఏపీలో BRS పార్టీకి ఊహించని షాక్‌ తగిలింది. ఏపీలో BRS పార్టీ కార్యాలయం వద్ద ఫ్లెక్సీలు చింపివేశారు. గుంటూరు జిల్లాలో నిన్న బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే..ఏపీలో BRS పార్టీ కార్యాలయం ప్రారంభమై 24 గంటలు గడువక ముందే.. . ఏపీలో BRS పార్టీ కార్యాలయం వద్ద ఫ్లెక్సీలు చింపివేశారు.

రోడ్డు పై ఏర్పాటు చేసిన జెండాలు పీకేసిన గుర్తు తెలియని వ్యక్తులు..అర్దరాత్రి ఫ్లెక్సీలను చించేశారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, తెలంగాణ తరహానే ఏపీని కేసీఆర్‌ అభివృద్ధి చేస్తారని బీఆర్‌ఎస్‌ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. భారత దేశం ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశం..బీజేపీ కి దేశంలో ఎదురు గాలి వీస్తోందని పేర్కొన్నారు తోట చంద్రశేఖర్. మతతత్వ పార్టీ బీజేపీని దేశం నుండి తరిమి కొట్టాలంటే ఒక్క బిఆర్ఎస్ వల్లనే అవుతుంది..తెలంగాణా రాష్ట్రాన్ని ఒక మోడల్ గా తీసుకుని అన్ని రాష్ట్రాల ను అభివృ ద్ధి లో నడిపించాలనే కేసీఆర్ ఈ పార్టీ పెట్టారని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news