ఏపీలోనూ ఫార్ములా ఈ – రేసింగ్ నిర్వహిస్తాం – మంత్రి అమర్నాథ్

-

హైదరాబాద్ హుస్సేన్ సాగర్ వద్ద గ్రాండ్ గా నిర్వహించిన ఈ – ఫార్ములా రేసింగ్ ముగిసింది. రేసింగ్ విజేతగా జిన్ ఎరిక్ నిలిచాడు. 2, 3 స్థానాలలో నిక్ క్యాసెడీ, సెబాస్టియన్ ఉన్నారు. రేసింగ్ చూసేందుకు సెలబ్రిటీలతో సహా పెద్ద ఎత్తున ప్రేక్షకులు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ ఈ స్థాయికి చేరుకోవడంలో ఆంధ్ర ప్రజల పాత్ర కూడా ఉందన్నారు.

ఫార్ములా ఈ రేస్ మొదటిసారిగా తెలుగు నేలపై జరుగుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. తెలుగువారిని ఈ స్థాయికి తీసుకువెళ్లిన రేస్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లోను ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నామని చెప్పారు. తెలుగువారిగా పుట్టడం ఎంతో గర్వించదగ్గ విషయమని, అమెరికా ఆర్థిక వ్యవస్థ పెరగడంలో తెలుగువారి కృషి ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news