దారుణం.. ఏలూరులో నాలుగో తరగతి విద్యార్థి హత్య

-

ఏపీలో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా బుట్టాయగూడెంలో దారుణ హత్య జరిగింది. పులి రామన్నగూడెంలోని గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న నాలుగో తరగతి విద్యార్థిని గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు.

సోమవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత గోగుల అఖిల్‌(9) అనే విద్యార్థి హత్యకు గురైనట్లు తెలుస్తోంది. ఈ దారుణానికి పాల్పడింది ఎవరు.. ఎందుకు హత్య చేశారనే కారణాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే వసతి గృహం సిబ్బంది విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై సమాచారం అందుకున్న బుట్టాయగూడెం పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. విద్యార్థి మృత దేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. విద్యార్థి హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

తోటి విద్యార్థులు, వసతి గృహం సిబ్బంది, నిర్వాహకులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థికి ఎవరితో అయినా గొడవలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అఖిల్ హత్యతో వసతి గృహంలో మిగతా విద్యార్థులంతా భయాందోళనకు గురయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news