ఏపీ మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు.. క్లారిటీ

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మందుబాబులకు బిగ్‌ అలర్ట్. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులే జరుగుతున్నాయని బేవరేజెస్ కార్పొరేషన్ తెలిపింది. మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు జరగడం లేదని ఇటీవల జనసేన ఆరోపించడంతో క్లారిటీ ఇచ్చింది.

కొన్ని లిక్కర్ షాపుల్లో ఆన్లైన్ పేటియం ద్వారా, మరికొన్ని దుకానాల్లో SBI ఈజీ ట్యాప్ ద్వారా డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయని, నగదు చెల్లింపులను కూడా అనుమతిస్తున్నట్లు వివరించింది. ఏపీ మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు అన్న విషయంపై ఎవరూ ఆందోళనలు చెందాల్సిన పనిలేదని వివించారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news